WhatsApp Image 2024-02-05 at 4.28.21 PM (1) Trending News

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం పెంచాలి…

కాకినాడ డీ.ఈ.వో. ఆఫీసు వద్ద సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి ఆర్.జే.డీ. కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తాననిఇచ్చిన హామీను మరిచి పోయారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నిత్యవసర ధరలు భారీగా పెరిగాయన్నారు. […]

WhatsApp Image 2024-02-05 at 3.29.05 PM Political

రామచంద్రపురంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో బత్తుల లక్ష్మణరావు…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మాత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇంచార్జ్ బత్తుల లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తొలత మహాపురుషుల చిత్రపటాలను పట్టుకుని నాయకులు, కార్యకర్తలు కలిసి జ్యోతిని వెళిగించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు కామేశ్వరరావు, భక్తులు చినబాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సద్యరావు, నియోజకవర్గ ట్రజరర్ […]

WhatsApp Image 2024-02-05 at 4.28.00 PM Exclusive

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన మహిళలు…

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో కాపవరం గ్రమానికి చెందిన 100 మహిళలు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చారని ఇప్పటి వరకు ఇళ్ల స్తళల్లు చూపించలేదని సోమవారం కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అధికారులకు ఎన్ని సార్లు విన్నమించుకున్నా పట్టించుకోలేదన్నారు. వెంటనే ఇళ్ల స్థలాలను చూపించి కట్టుకోవడానికి అనుమతులివ్వాలని డిమెండ్ చేసారు.

WhatsApp Image 2024-02-05 at 2.47.20 PM Exclusive

జగనన్నకు చెబుదాం ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి….

జగనన్నకు చెబుదాం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో అర్జీదారుల సంతృప్తి పడేలా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లాస్థాయి అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి భవన్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి […]

కాంట్రాక్టర్లు మా పొట్టలు కొట్టొద్దు… -జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్-

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 5వ రోజైన సోమవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జనార్దన్, భాగ్యలక్ష్మి లు మాట్లాడుతూ… తాము గత 20 సంవత్సారాలు జి.జి.హెచ్. లో కీలక విభాగమైన శానిటేషన్ లో పని చేస్తున్నామన్నారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై చాలా సార్లు అధికారులకు, […]

WhatsApp Image 2024-02-05 at 2.03.10 PM Exclusive

అత్యవసర మందులపై జీ.ఎస్.టీ. తొలగించాలి…

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం నందు ఏడో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కాకినాడ నగర అధ్యక్షులు స్వామి మరియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ వెంకన్న మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ […]

maxresdefault (5) Political

బీ.సీ. ల సంక్షేమం టీ.డీ.పీ. తో నే సాద్యం…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీ.సీ. ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. బుచ్చిబాబు హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బీ.సీ.లకు సంక్షేమంలోను, రాజకీయాల్లోను ప్రధాన్యతను కల్పించింది కేవలం తెలుగు దేశం పార్టీ మాత్రమే అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేసారన్నారు. తదనంతరం […]

WhatsApp Image 2024-02-05 at 9.35.16 AM Exclusive

పోలింగ్ కేంద్రాలపై నిఘా…!!! -సీ.ఐ వాసా వెంకటేశ్వర రావు-

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలెక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో పోలింగ్ కేంద్రలను అధికారులు సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నంపచోడవర్ం మండలంలో సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు, ఎస్.ఐ. ఎం. మోహన్ కుమార్ రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లను పరీశిలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువతీ, యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సంబంధిత […]

chiru_V_jpg--816x480-4g Movies

చిరంజీవికి అభినందనలు తెలిపిన కన్నడ సూపర్ స్టార్…

భారతీయ సినిమా ప్రఖ్యాత ఐకాన్ మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అద్భుతమైన విజయాలను అందిచారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. తన విజయాలకు గాను ఇటీవల గౌరవనీయమైన పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి ప్రశంసలు మరియు ప్రేమను అందుకుంటున్నారు. అయితే చిరంజీవికి తన అభినందనలు తెలియజేయడానికి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారిని ఆయన స్వగృహం […]