వాటర్ వర్క్స్ ప్రాంగణం పరిశుభ్ర పర్చాలి…
కాకినాడ సిటీలో ఉన్న కుళాయిచెరువు వాటర్ వర్క్స్ ప్రాంగణాన్ని పరిశుభ్రంచేయించాలని కాకినాడ పౌరసంక్షేమ సంఘం కోరింది. ఈ సంందర్బంగా వారు మాట్లాడుతూ… రామారావుపేటవైపున ఉత్తరం నుండి దక్షిణం వైపు భాగం పొడవునా ఏపుగా పెరిగిన తుప్పలు పొదలు భారీగా ఉన్నాయన్నారు. నగరానికి త్రాగు నీరు సరఫరా అయ్యే ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడం తగదన్నారు. వాటర్ వర్క్స్ ఆవరణలో పూర్తి స్థాయిగా పచ్చదనం పెంచే గ్రీన్ గార్డెన్ తో సుందరీకరించాలన్నారు. ఆవరణలో వున్న వివేకానంద పార్కు సైన్స్ సెంటర్ […]









