WhatsApp Image 2024-02-10 at 10.11.06 AM Viral

నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు హేమంత కుమార్ హౌస్ అరెస్ట్…!!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై సీ.ఎం. క్యాంప్ కార్యలయం ముట్టడికి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ పిలుపునిచ్చారనే అభియోగంతో పోలీసులు అతన్ని హౌస్ అరెస్టు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ వయోపరిమితి పెంచారని అదే విదంగా ఏ.పీ. లో ఏ.పీ.పీ.ఎస్సీ. కి మరియు ఏ.పీ. డీ.ఎస్సీ. కి 47కు వయోపరిమితి పెంచమని, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఐదు గ్రేస్ మార్కులు వెయ్యాలని, గ్రూప్ టు  వాయిదా […]

WhatsApp Image 2024-02-09 at 7.14.15 PM Trending News

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు…!!!

కాకినాడ జిల్లాలోని కాకినాడ నగర పరిధిలోని 10వ వార్డు దుమ్ములపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్న రామాలయం వద్ద నిర్వహించిన శిబిరానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని తెలిపారు. వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై […]

WhatsApp Image 2024-02-09 at 7.15.21 PM Knowledge

ఆరోగ్య శిబిరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి…!!!

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహించి అక్కడ ఉన్న ప్రజల్లో వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిస్తామని వడ్డాది ఆదిత్య అన్నారు. శుక్రవారం ఆదిత్య ఇనోదయ ఆసుపత్రి గ్రూపులో చేరడం పట్ల ఆసుపత్రి ఎం.డి. డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ హర్షం వ్యతం చేసారు. మొదట డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తదనంతరం కాకినాడ ఇనోదయ ఆసుపత్రిలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిత్య రోటరీ గోల్డెన్ […]

WhatsApp Image 2024-02-09 at 8.22.33 PM Exclusive

కాకినడలో ఎం.డీ.యూ. వాహనాల తనిఖీ…!!!

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎం.డీ.యూ. వాహనాల ద్వారా ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెలా పంపిణీ చేస్తున నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులో పంపిణీ చేయాలని జే.సీ. సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య వాహనదారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ పట్టణం 1వ వార్డు రమణయ్య పేట, బోట్స్ క్లబ్ ప్రాంతాల్లో ఎం.డీ.యూ. వాహనం ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, పంచదార ఇతర సరుకుల తూకం, […]

మరోసారి మోసం చేయడానికా… సిద్ధం ?

తుని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఏపీ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిళ మాట్లాడుతూ ఘాటు విమర్శలు చేశారు. తుని వస్తుంటే ఒక ఆన్న తో మాట్లాడా… వాన వస్తె అంతా వరదే అన్నాడు. వైఎస్సార్ ఉన్నప్పుడు తాండవ నదికి రిటైనింగ్ వాల్ కడతా అని హామీ ఇచ్చారట.. వైఎస్సార్ చనిపోయాక వాల్ సంగతి మరిచారు అని ఆ ఆన్న చెప్పాడు. బాబూ కట్టలేదు… మీ ఆన్న జగన్ కట్టలేదు అన్నారు. దివిస్ […]

WhatsApp Image 2024-02-09 at 8.24.28 PM Education / Career

వారి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌టిష్ట ఏర్పాట్లు…!!!

ప‌దవ తరగతి, ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి, ప‌టిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా ఆదేశించారు. శుక్రవారం క‌లెక్ట‌రేట్‌ లో జిల్లాలో ప‌ది, ఇంటర్ పబ్లిక్ ప‌రీక్ష‌ల‌తో పాటు ఏ.పీ. ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్.ఎస్‌.సీ., ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ, ఇంటర్మీడియట్, ఓపెన్ స్కూల్ సొసైటీ, పోస్ట‌ల్‌, జిల్లా పరిషత్, పోలీస్‌, ర‌వాణా, త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ […]

WhatsApp Image 2024-02-09 at 11.04.01 PM Crime

అమలాపురంలో పీ.డీ.ఎస్. బియ్యం పట్టువేత…!!!

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణములోని మార్కెట్ వీధిలో గల డోర్ నెం. 2-4-63/2 నందు పి.డి.ఎస్‌. చౌక బియ్యం అక్రమ నిల్వకు సంబంధించి విశ్వసనీయ సమాచారంపై విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి సదరు ఇంటిని తనిఖీ చేసారు. ఆ తనిఖీల్లో 24 బస్తాలలో 1200 కేజీల పి.డి.ఎస్‌. బియ్యాన్ని గుర్తించారు. పి.డి.ఎస్‌. బియ్యం అమలాపురం మండలంలోని నడిపూడి గ్రామానికి చెందిన అరిగెల వీరాంజనేయులుకి చెందిందిగా అధికారులు గుర్తించారు. […]

nagababu Political

ఇన్ని రిజర్వాయర్లున్నా రైతులు కష్టాలు తీరేదెపుడూ…

శుక్రవారం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావాశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు విచ్చేసారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… మాడుగుల నియోజకవర్గంలో రైవాడ, పెద్దేరు, తారకరామ, పాలగెడ్డ, గొర్రిగెడ్డ, ఉరకగెడ్డ ఇన్ని రిజర్వాయర్లు ఉన్నా రైతులు సాగునీటికి ఎప్పుడూ కష్టాలు పడుతున్నారన్నారు. కాలువలు అధ్వానంగా వుండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఆధునికీకరణ, మరమ్మతు పనుల […]

maxresdefault (9) Sport

పిఠాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం…!!!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజావారి కోటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను వర్మ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎం.ఎల్.ఏ. వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురంలో ప్రారంభించిన టోర్నమెంట్ పోటీల్లో 45 టీములు పాల్గొంటాయన్నారు. వాలీబాల్ ఆటగాళ్లకి పుట్టినిళ్లు పిఠాపురమన్నారు.

WhatsApp Image 2024-02-09 at 5.32.13 PM Exclusive

వెట్టి చాకిరీ నిర్మూలన ర్యాలి…!!!

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24లో పొందిపరచబడిన రీతిలో సమాజంలోని బలహీన వర్గాల దోపిడీని నిరోధించడానికి కొన్ని చట్టాలు అమల్లో ఉన్నట్లు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ టీ. నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బ్యాంకు కాలనీ కార్మిక శాఖ కార్యాలయం నుండి ఎర్ర వంతెన మీదుగా ముమ్మిడివరం గేటు వరకు సహాయ కార్మిక కమిషనర్ ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ నిర్మూలన దినంగా పాటిస్తూ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ… […]