WhatsApp Image 2023-10-19 at 8.07.14 AM Political

తడిచెత్త నుంచి కంప్రస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు… కమిషనర్‌ నాగనరసింహారావు

తడి చెత్త నుంచి కంప్రస్డ్‌ బయోగ్యాస్‌ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా తోడ్పాటు లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. కేంద్రప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ అంశంపై కార్పొరేషన్‌ కార్యాలయంలో సంబంధిత ఏజన్సీలతో కమిషనర్ సమావేశమయ్యారు. కంప్రస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థకు స్థలాన్ని సమకూర్చడంతోపాటు స్వచ్ఛభారత్‌ మిషన్‌ నుంచి ఆర్థిక తోడ్పాటు కూడా లభిస్తుందన్నారు. తడి చెత్త నుంచి […]

WhatsApp Image 2023-10-19 at 8.07.29 AM Political

త్వరలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పునరుద్దరణ.. స్మార్ట్‌సిటీ ఎండీ నాగనరసింహారావు వెల్లడి

స్మార్ట్‌సిటీ పర్యవేక్షణలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ)ను త్వరలోనే పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్మార్ట్‌సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీ.ఈ.వో, నగరపాలక సంస్థ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఐసీసీసీని పునరుద్దరించే అంశంపై తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ… రూ. 98 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌సెంటర్‌ నిర్వహణ చేసేందుకు మూడు ఏజన్సీలతో మాట్లాడామన్నారు. ఇందులో ఒక ఏజన్సీని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. […]

WhatsApp Image 2023-10-18 at 6.18.01 PM Political

దోపిడీ రహిత సమాజం కోసం పాటుపడదాం…. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి

పార్టీ కార్యకర్తలు రాజకీయ సైద్దాంతిగా అవగాహనతో ఉండాలని దోపిడీ రహిత సమాజం కోసం పాటుపడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కమ్యూనిస్టు పార్టీ పని విధానం అనే అంశం పై వర్క్ షాప్ కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర్ చౌదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షులు తాటిపాక మధు సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా జెవి సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి […]

WhatsApp Image 2023-10-18 at 5.09.33 PM Political

రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఎన్నికలపై జనసేన నిర్ణయం…

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని పేర్కొంది. మిత్రపక్షమైన భాజపా విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈసారి […]

WhatsApp Image 2023-10-18 at 3.27.03 PM Political

రావులపాలెంలో నాదేండ్లకు ఘన స్వాగతం… – అభిమాని కుటుంభాన్ని ఆదుకున్న జనసేన పార్టీ

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌కు రావులపాలెంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న ఆయన రావులపాలెం చేరుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, పితాని బాలకృష్ణ, బండారు శ్రీనివాస్‌, వేగుళ్ల లీలాకృష్ణ, తదితర నాయకులు గజమాలతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి కొత్తపేట నియోజకవర్గం చేరుకున్నారు. ఇటీవల రోడ్డు […]

WhatsApp Image 2023-10-17 at 3.58.03 PM News Andhra Pradesh Political

ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి

పోస్టర్ను ఆవిష్కరించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అన్నారాము కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి ఆధ్వర్యంలో… అక్టోబర్ 18వ తేదీ నుండి రాష్ట్ర కేంద్రంలో ఓపి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జరిపేటువంటి నిరవధిక దీక్షలు విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారాము  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరవధిక […]

WhatsApp Image 2023-10-17 at 5.33.24 PM Political

మెరుగైన వైద్య సేవలకే జగనన్న ఆరోగ్య సురక్ష – కమిషనర్ నాగ నరసింహారావు-

ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక సీతారామనగర్ యూ పి హెచ్ సి ఆవరణలో  జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని కమిషనర్ సందర్శించారు. అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి ఎంతమంది శిబిరానికి వచ్చారు ? ఎంతమందికి వైద్య సేవలు అందించారు ? వంటి అంశాలను ఆరా తీశారు. నాలుగో […]

WhatsApp Image 2023-10-17 at 2.47.16 PM (1) Political

రూ.5.79 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సం….

అల్లవరం మండలం మొగళ్ళమూరు గ్రామంలో వేదాంత క్లీన్ ఎనర్జీ సిఎస్ఆర్ నిధులైన రూ. 28.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 40,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ ట్యాంకును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మరియు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ లు ప్రారంభించారు. తద్వార ఆయన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుతగా నూతనంగా నిర్మించిన తాగునీటి సరఫరా ఓహెచ్ఎస్ఆర్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యులు […]

WhatsApp Image 2023-10-16 at 5.27.02 PM Political

దళితులను నట్టేట ముంచుతున్న వైసీపీ ప్రభుత్వం..

దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నేడు దళితులను నట్టేట ముంచి, దళితులను చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం ఉన్నత పదవులు కనిపిస్తున్నాదని, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు, కే.ఎస్ జవహర్, అఖిలపక్ష నాయకులు తాటిపాకు మధు, దువ్వ శేషుబాబ్జి ఆవేదన వ్యక్తం చేసారు. దళిత సోదరుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దుచేసి జైల్లో ఉంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ కాకినాడ సిటీ […]

WhatsApp Image 2023-10-16 at 5.28.16 PM (1) Political

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయలి…

రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో స్థానం సంపాదించుకున్న ముగ్గురు పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టా శివప్రసాద్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్సులుగా ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మట్టా శివప్రసాద్, ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులు మాట్లాడుతూ… చోటు కల్పించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి తగు చర్యలు చేపట్టి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని చెప్పారు. […]