IMG-20231126-WA0007 Exclusive

27 న స్పందన, డయల్ యువర్ కమిషనర్… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు వెల్లడి-

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. స్థానిక సమస్యలను కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఫోన్ నెంబర్ 08842357800 కు కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చనీ ఆయన అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ […]

IMG-20231126-WA0008 Exclusive

ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్…

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని అంబేద్కర్ పార్లమెంటు సమర్పించారన్నారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు.రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26న అంబేద్కర్ జ్ఞాపకార్థం రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే వారన్నారు. రాజ్యాంగ రూపకల్పనకు 2. సంవత్సరాల,11 నెలల18 రోజులు పట్టిందన్నారు. 1979 నుండి […]

IMG-20231125-WA0013 Political

సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పాలను అందిస్తోంది… -దెందులూరు ఎమ్మెల్యే చౌదరి-

సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తోందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి పేర్కొన్నారు. అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 43వ డివిజన్‌ ప్రతాప్‌నగర్‌ ప్రాంతంలో జరిగిన సంక్షేమ పథకాల లబ్థిదారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి నేరుగా ప్రజలవద్దకు వెళ్ళి ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని ఆరా తీసి స్పందనను తెలుసుకున్నారు. […]

IMG-20231125-WA0012 Exclusive

కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్…

సామర్లకోట మండలం హుస్సేన్పురం లో ఘోర ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం హుస్సేన్పురం సమీపంలో ఒక ట్రాక్టర్ అదుపు తప్పడంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. సామర్లకోట నుండి వేట్లపాలెం వెళుతున్న ట్రాక్టర్ అతివేగంగా వస్తున్న ఒక ఆటోను తప్పించే క్రమంలో అదుపుతప్పి గోదావరి కాలువలోకి దూసుకు వెళ్ళింది. అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ నుండి కాలువలోకి దూకడంతో ప్రమాదం తప్పింది. ఆటో ప్రయాణికులకు ఇటు డ్రైవర్ క్షేమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

IMG-20231125-WA0011 Kakinada

ఓటర్ జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యండి… -ఆర్డీవో సీతారామారావు-

జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రకటన చేయనున్న క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లు ఇంటింటా ఓటరు జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యాలని పెద్దాపురం ఆర్డీవో సీతా రామారావు ఆదేశించారు. సామర్లకోట మున్సిపాలిటీలో అందరు బి.ఎల్.వో. లు, సూపర్వైజర్ లకు ఓటర్ జాబితాల పరిశీలన పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ జె. రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో మాట్లాడుతూ… తుది జాబితా తయారీకి గానూ ఇంటింటికీ […]

IMG-20231124-WA0017 Political

అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది… -మంత్రి చెల్లుబోయిన-

అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర బీ.సీ. సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు.   మంత్రి వేణుగోపాల కృష్ణ కాజులూరు మండలంలో జరిపిన పర్యటనలో భాగంగా సమగ్ర శిక్షణా విభాగం ఆధ్వర్యంలోని కాజులూరు భవిత కేంద్రంలో చదువుతున్న 8 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన మూగ, చెవిటి దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, యాప్ లతో […]

IMG-20231116-WA0036 Political

కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బతీస్తున్న వాలంటీర్ల అవినీతి…

రాష్ట్రంలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో వాలంటీర్ల అవినీతి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ లక్ష్యాలు నీరుగారి పోతున్నాయని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ చిలుకూరు రామకుమార్, రంబాల వెంకటేశ్వరరావు, శ్రీ ముత్తా నవీన్, తదితరులు స్థానిక ఆర్టీవో ఆఫీస్ రోడ్డులో జిల్లా పంచాయతీ ఆఫీసర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి జిల్లా పంచాయతీ ఆఫీసర్ కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతి […]

IMG-20231116-WA0037 Kakinada

జగన్నాధ పురం MSN చారిటీస్ లో ట్రాఫిక్ నిబంధనలపై సదస్సు….

కాకినాడ నగరం జగన్నాధపురం లో MSN చారిటీస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సి.ఐ. రమేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో అశేషంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సి.ఐ. రమేష్ మాట్లాడుతూ… ప్రతీ విద్యార్థి, విద్యార్థినులు ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి తద్వారా ప్రమాదాలను నియంత్రించగలమని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ఎస్.ఐ. కిశోర్ బాబు, ఏ.ఎస్.ఐ. రమణ మూర్తి , హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

OIP (7) Kakinada

రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్షన్ టీంలు ఏర్పాటు చేయ్యాలి… -జిల్లా ఎస్పీ-

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికెట్టి, యువతను ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక యాక్షన్ టీంలు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిలో భాగంగానే ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రుల సైతం కుటుంబాల్లో యువతను హెచ్చరిస్తూ వారిని క్రమబద్ధీకరించడం ద్వారా తోడ్పాటును అందించాలన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు, నాయకులు నేతల శ్రీనివాసరావు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబుమాట్లాడుతూ… బలుసులపేట పరిధిలో ఉన్న యువత సరైన […]

WhatsApp Image 2023-11-14 at 6.42.58 PM Education / Career

సాంబమూర్తి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు…

కాకినాడ రామారావుపేటలోని మహర్షి బులుసు సాంబమూర్తి జిల్లా ప్రజా పరిషత్ ఓరియంటల్ ఉన్నతపాఠశాలలో బాలల దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ (హెన్) ప్రాజెక్ట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.ఎన్. మూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పాఠశాలలో ప్రతి గురువారం తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ విధానం వలన […]