WhatsApp Image 2024-02-20 at 9.04.50 PM Exclusive

మాతా శిశు మరణాలు జరగకుంగా దృష్టి సారించాలి… -డి.ఎం.హెచ్.ఓ. డా. కే. వెంకటేశ్వరరావు-

తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మాత శిశు మరణాలపై వైద్యులు, వైద్య సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ కే. వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మాతాశిశు మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణతో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ మరణాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గర్బిణి స్త్రీల ఆరోగ్యం పరిస్థితి, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని […]

maxresdefault (4) Trending News

బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు… -డా. యస్.జీ.టి. సత్య గోవింద్-

తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.టి.జి. సత్య గోవింద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదని అలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు తెలిపారు. పశు సంవర్ధక శాఖ పూర్తిగా సర్వే […]

WhatsApp Image 2024-02-20 at 9.04.41 PM Exclusive

కృష్ణ జనార్ధన స్వామి రథోత్సవంలో పాల్గోన్న మంత్రి కుటుంబ సభ్యులు…

నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరంలోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బి.సి. సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పురస్కరించుకుని అనంతరం జనార్ధన స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవంలో సతి సమేతంగా పాల్గోన్నారు.ఈ […]

WhatsApp Image 2024-02-20 at 5.03.20 PM Exclusive

వైద్యారోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యునైటెడ్ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీ.ఐ.టీ.యు. ఆధ్వర్యంలో వైద్యారోగ్య ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు డి.ఏ. రత్న రాజు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సమిష్టిగా కలిసి హక్కులు సాధించుకోవాలని అన్నారు. ఉద్యోగులు ఎంతో కష్టపడి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తుంటే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోగా జీతబడ్త్యాలలో చాలా వ్యత్యేసం ఉందని శ్రమకు తగ్గ జీతాలు లేవని అన్నారు. నీరజ మాట్లాడుతూ… అధికారుల వేధిపులు […]

Nadendla_Manohar_Janasena Exclusive

1,02,836 మంది వాలంటీర్ల డేటా నమోదు కాలేదు…

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్ల డేటా అసలు నమోదు కాలేదని, వారున్నారా.. లేరా..? అనేదానిపై జగన్ జవాబు చేప్పాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రతి ఏటా డేటా లేని వాలంటీర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ. 617 కోట్ల గౌరవ వేతనాలు ఎవరు మింగేస్తున్నారని, అసలు వీరంతా ఎక్కడున్నారని అన్నారు. వాలంటీర్ల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిలో ఎవరి పాత్ర ఏమిటో ప్రజల ముందు […]

WhatsApp Image 2024-02-20 at 4.15.21 PM Exclusive

వాలంటీర్లను సత్కరించిన ఎం.పీ. భరత్…

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పీ. భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వాలంటీర్లకు షాలువా కప్పి, ప్రసంసా పత్రాలను అందచేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారికి చేస్తున్న సేవలు మరువలేనిదని అన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అసలయిన లబ్ధి దారులను గుర్తించి వారికి పథకాలు […]

WhatsApp Image 2024-02-20 at 1.15.26 PM Viral

విశాఖలో ఆర్.బీ.ఐ. ప్రాంతీయ కార్యాలయం…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. అందులో భాగంగా 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఆర్ధిక శాఖ చెప్పినట్లు అనువైన భవనాన్ని గుర్తించి అనంతరం తెలియజేస్తే తమ బృందం వచ్చి పరిశీలిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఇది ఇలా ఉంటే గతంలో టీ.డీ.పీ. ప్రభుత్వం అమరావతిలో ఆర్బీఐ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-02-20 at 3.50.21 PM Viral

కాట్రావులపల్లిలో అసాంఘిక శక్తులు…

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారు అన్న కోపంతో ఆ గ్రామంలోని దళిత యువకులను లక్ష్యంగా చేసుకుని వారిపై భౌతిక దాడులకు దిగడం రోడ్లపై కారులతో ఢీకొట్టడం బహిరంగ ప్రదేశాల్లో అయితే చంపేస్తానని బెదిరిస్తున్న. ఒక కుటుంబం పై దళిత నాయకులు అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు.

WhatsApp Image 2024-02-20 at 8.52.18 AM Viral

దళితులపై కక్ష సాదింపు చర్యలెందుకు…???

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారన్న కక్షతో ఆ గ్రామంలోని దళిత యువకులే లక్ష్యంగా వారిపై భౌతిక దాడులు, రోడ్లపై కారులతో ఢీకొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో చంపేస్తానని బెదిరిస్తుండడంతో దళితులు అక్కడ నాయకుల అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని సానుకూలంగా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూసి కారుకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో దళిత యువకులు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే… […]

WhatsApp Image 2024-02-19 at 1.51.58 PM Kakinada

వివేకా పార్కు జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించాలి…

కాకినాడ నగరంలో ఉన్న కుళాయి చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్ ల సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా కు పౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన […]