ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గురువారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాస్తూ, నగరవాసులకు 2012 నుంచి నీటి బిల్లుల ద్రవ్యోల్బణాన్ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో కేజ్రీవాల్ లేఖకు ఇచ్చిన సమాధానంపై స్పందించారు. నీటి బిల్లుల ద్రవ్యోల్బణంపై కేజ్రీవాల్ సమాధానంలో ఒక్క మాట లేదని సక్సేనా అన్నారు. 2012 నుండి 10 లక్షల మంది ప్రజలు ఎలా పెంచి బిల్లులు పొందుతున్నారు. ఇది జరగడానికి మీరు ఎలా అనుమతించారు […]
రెండు వారాల్లో గ్రూప్ టు ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేస్తే, ప్రధాన పరీక్షకు చదువుకోవడానికి సమయం ఉంటుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ తెలిపారు. ప్రభుత్వ అకాడమీ, ప్రామాణికమైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, పెద్ద పెద్ద ప్రశ్నలు వల్ల సమయం సరిపోక గ్రూప్ టు అభ్యర్థులు ఇటీవల ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్-2 లో అర్హత కోల్పోతారని భయపడుతున్నారని అన్నారు. కనీసం ఏ.పీ.పీ.ఎస్.సీ. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో […]
త్రిపురలోని ఆదివాసీ వర్గాల మనోవేదనలను పరిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎం.మెచ్.ఏ. ముసాయిదా ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని సిద్ధం చేసిందని కేంద్రంతో చర్చలు జరపడానికి ఢిల్లీకి వచ్చిన టిప్రా మోతా వ్యవస్థాపకుడు ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బర్మ చెప్పారు. త్రిపురలోని పూర్వపు మాణిక్య రాజవంశం యొక్క నామమాత్రపు అధిపతి అయిన డెబ్బర్మ, రాష్ట్ర గిరిజనులకు రాజ్యాంగ పరిష్కారాన్ని కనుగొనడంలో కేంద్రం జాప్యం కి వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. అతను 2023 అసెంబ్లీ ఎన్నికలలో […]
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘ కాలం వివిధ హోదాలలో పని చేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ ఆలీ విశ్రాంత జీవితం కుటుంబ సభ్యుల తో సుఖ శాంతులతో గడపాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. గురువారం స్థానిక ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది పదవి విరమణ చేసిన డివిజనల్ పి.ఆర్.ఓ. ఎం.డి. […]
గంజాయి వాడకం వలన యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని గంజాయి బారిన పడకుండా యువజనుల సంక్షేమం కోసం తల్లిదండ్రులు అప్రమత్తత వహించాలని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్థానిక వివేక్ భవన్ లో పౌర సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మద్యం మాదక ద్రవ్యాలు సేవించి మోటారు వాహనాలు నడపడం ఎంత నేరమో మద్యం సేవించి పొలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి ఓటు హక్కు వినియోగించడం […]
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలు చేయాలని ఏ.పీ. బిల్డింగ్& అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పిలుపును ఇచ్చారు. ఇందులో భాగంగా కాకినాడలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలం అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికుల సంగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. అన్నవరం అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఒకే తరహాలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ […]
ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను జీఎస్టీ కేసులో అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పుల్లారావు స్పందించారు. స్టేట్ మెంట్ పేరుతో పిలిచి అదుపులోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. అడిగితే ఏ.పీ.ఎస్.డీ.ఆర్.ఐ. డిపార్టుమెంట్ అని చెబుతున్నారని అన్నారు. అసలు వారు చెబుతున్న కంపెనీలతో శరత్కు ఎటుంటీ సంబంధం లేదని అన్నారు. టీ.డీ.పీ. సీటు ప్రకటించిన రోజునే కావాలని ఈ కేసు పెట్టారని వాపోయారు.
డాక్టర్ బీ.అర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికయిన మహాసేన రాజేష్ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో మహాసేన రాజేష్ పై అసంతృప్తి సెగలు ఎక్కువగా ఉండటంతో అయినవిల్లి సెంటర్ మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయం చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటులు చేసినట్లు అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక దిండోరిలోని బడ్జార్ ఘాట్ ప్రాంగణంలో ఒక వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దానితో ఆ వాహనంలో ఉన్నవారిలో 14 మంది మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భాదితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం షాపురా పోటీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిపారు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని […]