WhatsApp Image 2024-02-02 at 5.41.22 PM Trending News

సమ్మె చేసే పరిస్థితి రాకుండా సమస్యలు పరిష్కరించండి…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 3 వ కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలకు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు‌. అందువల్ల చాలా ఓపికగా తమ సమస్యలను అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థ వారికి విన్నవిస్తూ వచ్చామన్నారు. సమ్మె చేసే పరిస్థితి […]

WhatsApp Image 2024-02-02 at 5.37.29 PM Trending News

పంట బ్యాంకు రుణాల పరిమితులపై సమావేశం… -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్-

రాబోయే 2024-25 సంవత్సరానికి గాను కోనసీమ జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్సును జిల్లా యంత్రాంగం, బ్యాoకర్ల సమన్వయంతో నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జే.సీ. అధ్యక్షతన బ్యాంకర్లు, అధికారుల సమన్వయంతో టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయాల మేరకు స్థానిక వ్యవసాయ పెట్టుబడులను వ్యవసాయ అధికారుల […]

WhatsApp Image 2024-02-02 at 5.35.53 PM Exclusive

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలి… -జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా-

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడ జిల్లాకు నియమించిన అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య, ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించారు. జిల్లా కలెక్టర్ […]

WhatsApp Image 2024-02-02 at 3.50.28 PM Exclusive

వినియోగదారుల రక్షణ చట్టంప్రయోజనాలు విస్కృతం చేయాలి…

జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ఆదిత్య కు కాకినాడ పౌర సంక్షేమసంఘం గణపతి చిత్రపటాన్ని బహూకరించి పుష్ప గుచ్ఛంతో అభినందన లు తెలిపింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తమిళనాడు నుండి 2016 లో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ 79 ర్యాంకు సాధించిన ప్రవీణ్ గతంలో రంపచోడవరం ఐ.టి.డి.ఎ. అధికారిగా పోలవరం ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసి సమర్థవంతమైన అధికారిగా మంచి గుర్తింపుతో కాకినాడ జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం […]

WhatsApp Image 2024-02-02 at 2.57.32 PM Crime

కర్నూలు పోలీసుల వాహానాల తనీఖీలు… 4 గురు అరెస్ట్…???

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు వాహానాల తనిఖీలు చేపట్టారు. క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై ఉన్న టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల సమాచారంతో హైదరాబాదు నుండి కోయంబత్తూరు వెళుతున్న NL 01 M 2506 సురేష్ స్వామి అయ్యప్ప ప్రైవేట్ స్లీపర్, ఏ.సి. ట్రావెల్స్ బస్సు నందు నలుగురు నుండి బంగారం, వెండి […]

WhatsApp Image 2024-02-02 at 12.37.53 PM Crime

సెలవు పెట్టి మరీ ఈ రాష్ట్ర పోలీసులు గంజాయి సరఫరా…

హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూఅంద్ర ప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏ.పీ.ఎస్.పీ. కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల వాహనం నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

black-money_1820_110717064216 Crime

పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

నెల్లూరు జిల్లాలో భారీగా అక్రమ దారిలో తరలిస్తున్న నగదును పోలీసు స్వాధీనం చేసుకున్నారు. పై అధికారులు ఆదేశాలతో నెల్లూరు జాల్లాలో వాహనాల తనిఖీలు చేప్పట్టారు. అందులో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ దగ్గర రూ.1.44 కోట్లు దొంగ డబ్బును పట్టుకున్నారు. అదేవిదంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద రూ.4.38 కోట్లు, వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద రూ.1.4 కోట్లు నగదును పట్టుకొని సీస్ చేశారు. ఆ నగదును తరలిస్తున్న 15 మందిని అరెస్త్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

WhatsApp Image 2024-02-02 at 9.14.30 AM Political

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి ఉన్నత పథవి…!!!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి శ్రీనివాసరావు తన సమయ స్పూర్తితో, సమన్వయాలతో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అందుకుగాను ఆయన్ని ఆ పార్టీ ఎ.స్సీ. సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గా ఉన్నతి పథవినిస్తూ నియమకాన్ని జారీ చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు, పలువురు కార్యకర్తలు ఆయన స్వగృహములో కలసి అభినందనలు […]

BB1hACUr Exclusive

రూ. 47.66 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించిన సీతారామన్…

వ్యయం పెరగడం, మూలధన వ్యయం మరియు సామాజిక రంగ పథకాలకు అధిక కేటాయింపుల కారణంగా 2024-25 బడ్జెట్ పరిమాణం 6.1 శాతం పెరిగి రూ. 47.66 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రుణాలు మినహా మొత్తం రసీదులు సవరించిన అంచనా రూ. 27.56 లక్షల కోట్లు, ఇందులో రూ. 23.24 లక్షల కోట్లు పన్ను వసూళ్లని తెలిపారు. మొత్తం వ్యయంపై సవరించిన అంచనా రూ. 44.90 లక్షల కోట్లని లోక్‌సభలో బడ్జెట్ […]

9 Crime

దొంగ సారతో వ్యక్తి అరెస్ట్… ???

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన యు. కొత్తపల్లి మండలం దొంగ సార కాస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో కోనపాపపేట జీడిమామిడి తోటల్లో నిర్వహించే సారా బట్టీలలో సారా తయారు చేస్తున్న వాసంశెట్టి సతీష్ అనే వ్యక్తిని పట్టుకొని దాదాపు 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తపల్లి ఎస్.ఐ. స్వామినాయుడు తెలిపారు.