WhatsApp Image 2024-02-17 at 1.38.56 PM Trending News

ఆధునిక వైద్య సేవల్లో కాకినాడ జీజీహెచ్‌…

అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుంది. జీజిహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ ఎస్.లావణ్య కుమారి భాద్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రి లో అనూహ్యమైన రీతిలో కొత్త వైద్య విభాగాలు ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి.

WhatsApp Image 2024-02-17 at 1.33.40 PM Political

టీడీపీలోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. నాయకులు కొండపల్లి రామకృష్ణ, తోట చిట్టిబాబు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పి. వేమవరం టీ.డీ.పీ. నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పెద్దాపురం ఎమ్మేల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన నాయకులకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండపల్లి రామకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుత వై.సీ.పీ. ప్రభుత్వం పరిపాలన అక్రమంగా […]

WhatsApp Image 2024-02-17 at 1.12.47 PM Trending News

పోరాడితీరుతామంటున్న ఉద్యోగులు…

ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం APJAC రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు AP JAC, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ తాలూక ఆధ్వర్యంలో చేస్తున్న మధ్యాహ్న భోజన విరామ ఉద్యమ కార్యాచరణ లో భాగం గా శుక్రవారం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెంజనర్లు పాల్గోని నిరసన ప్రదర్శన మరియు ర్యాలి జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా APJAC ఛైర్మన్ జి రామ్ […]

WhatsApp Image 2024-02-17 at 12.34.02 PM Exclusive

రవాణా రంగాన్ని స్థంభింపచేసిన కార్మికులు…

ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పరిశ్రమ కార్మికుల సమ్మె, ట్రాన్స్పోర్ట్ సమ్మె విజయవంతమైంది. ఉదయం 5 గంటల నుండి కాకినాడ సి పోర్ట్ వద్ద పారిశ్రామిక సమ్మె చేపట్టారు. అనంతరం కోరమండల్, ప్యారి సుగర్, తదితర ఆయిల్ కంపెనీలు, పలు సంస్థల కార్మికులు ఈ సమ్మెలో […]

WhatsApp Image 2024-02-16 at 4.12.09 PM Crime

నకిలీ కరెన్సీ తో ముఠా అరెస్టు…

కాకినాడ జిల్లాలో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో నకలీ కరెన్సీ కలకలం రేపింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 20 లక్షలు నకలీ కరెన్సీ ని ఇచ్చి మోసం చేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలుకున్న ఆ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు అక్కిడికి వచ్చి వారిని తనిఖీ చేసి ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సై వి. కిషోర్ బాబు […]

WhatsApp Image 2024-02-16 at 4.13.21 PM Viral

పలు అభివృద్ది పనులను ప్రరంభించిన మంత్రి విశ్వరూప్…

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ దంగేటి బాలమణిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన సంస్కరణలను విద్యారంగంలో ప్రవేశపెట్టి విద్యార్థినీ, విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేసారన్నారు. దీని ప్రభావంతో చాలామంది సివిల్ సర్వీస్ వంటి ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయని […]

WhatsApp Image 2024-02-16 at 4.28.35 PM Political

కిసాన్ మోర్చా కార్మిక సంఘాల గ్రామీణ బంద్ విజయవంతం…

బి.జె.పి. ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించ దేశవ్యాప్త గ్రామీణ బంద్ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతం అయింది. నల్లజర్ల, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి రూరల్, పెరవలి గోపాలపురం, దేవరపల్లి, తదితర ప్రాంతాలలో వ్యవసాయ కార్మిక సంఘం, ఏ.పీ. రైతు సంఘం ఏ.ఐ.టీ.యూ.సీ., తదితర వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ లు బంద్ నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహించారు. […]

WhatsApp Image 2024-02-17 at 8.06.22 AM Political

17,000 నకిలీ ఓట్లు..!!!

ఓటమి భయంతో అధికార వైఎస్‌ఆర్‌సీ పార్టీ కాకినాడ నగరంలో సుమారు 17 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించి దొడ్డి దారిన ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుందని అధికారం చేతిలో ఉందని అక్రమాలకు పాల్పడొచ్చు అనుకున్న వైకాపా నాయకులకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-02-16 at 6.48.12 PM Exclusive

ఆధునిక వైద్య వేదికగా కాకినాడ జీ.జి.హెచ్. ఆసుపత్రి…

అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుందని జీ.జి.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. లావణ్య కుమారి అన్నారు. జీ.జి.హెచ్. సూపరింటెండెంట్ గా భాద్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రి లో అనూహ్యమైన రీతిలో కొత్త వైద్య విభాగాలు ఇక్కడ ఆవిష్కృతం అయ్యాయన్నారు. వాటిలో భాగంగానే కార్ధియో తోరాసిస్ , అంకాలజీ సర్జరీ విభాగాలు పేదలకు వైద్య సేవలు అందించేందుకు ప్రారంభమయ్యాయన్నారు. అంతే కాకుండా కీలకమైన విభాగాలకు నిపుణులైన వైద్యులను […]

WhatsApp Image 2024-02-16 at 4.32.12 PM Exclusive

మద్దతు ధర చట్టం కోసమే రైతాంగ గ్రామీణ బంద్…

పారిశ్రామిక సమ్మె, ట్రాన్స్ పోర్ట్ దేశవ్యాప్త సమ్మె కాకినాడ కె.ఎస్.పి.ఎల్ పోర్టు ఎదుట కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం బంద్ నిర్వహించిచారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షురాలు జి .బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, తదితరులు మాట్లాడుతూ… మోడీ హయాంలో 12 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలు మాఫీ జరిగి ప్రపంచ కుబేరుల్లో చేరుతుంటే, గిట్టుబాటు ధర లభించని రైతులు రుణాలు చెల్లించలేక 1,60,000 మంది ఆత్మహత్యలకు మోడీ విధానాలే కారణమయ్యాయని విమర్శించారు. […]