f88ee5901f3cf151f74c6c66256a19da Trending News

రూ.25 కోట్లతో సామర్లకోట రైల్వేస్టేషన్ అభివృద్ధి…

అను నిత్యం పెరుగుతున్న ప్రయాణికుల అవసరార్థం సామర్లకోట రైల్వే స్టేషన్ ను రూ. 25 కోట్లతో ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లో పూర్తిస్థాయిలో ఆధునీకరించుటకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. రైల్వే స్టేషన్ ముందుభాగం ఆధునీకరణ, ప్లాట్ఫారాలు మార్చేందుకు, అదనపుకాలిబాట, వంతెన రెండు ఎస్క లేటర్లు, ప్రయాణికులు ఉపయోగించే ప్లాట్ఫారాలకు పూర్తిస్థాయిలో రేకుల షెడ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందన్నారు. అదనపు మరుగుదొడ్లు, దివ్యాంగులకు వెయిటింగ్ […]

dwarampudi-shocking-comments (1) Exclusive

రజక కమ్యూనిటి హాల్ ను ప్రరంభించిన ద్వారంపూడి…

కాకినాడ జిల్లాలో కాకినాడ 44వ డివిజన్ శారదాదేవి ఆలయ ప్రాంతంలో నగరపాలక సంస్థ సాధారణ నిధులయిన రూ. 99.60 లక్షల రూపాయిల వ్యయంతో నిర్మించిన రజక కమ్యూనిటి హాల్ ప్రరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్స కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి ముఖ్య అతథిగా హాజరయ్యారు. ఆయన తొలత ప్రజ్వలన వెలిగించి రిబ్బన్ కత్తిరించి కమ్యూనిటి హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం రజక సామాజిక వర్గానికి […]

OIP (22) Viral

జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం…

కాకినాడ జిల్లా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కగా ఆగి టైర్ మార్చుకుంటున్న లారీ డ్రైవర్స్ మరియు క్లీనర్ ను గుర్తు తెలియని బస్ వచ్చి వేగంగా గుద్దింది అదే దారిలో ఉన్న షోల్డర్ సైడ్ వున్నా బెగ్గర్ ను కూడా గుద్ది వెళ్లిపోయింది. ఇందులో మొత్తం 4 గురు చనిపోయారు. ఇద్దరు డ్రైవర్స్, ఒక క్లీనర్ మరియు బెగ్గర్ ఉన్నట్లు […]

WhatsApp Image 2024-02-25 at 7.32.17 PM (1) Viral

ప్రతిష్టాత్మకంగా ఇర్రిపాక లో కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం…

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. జ్యోతుల నెహ్రూ ఈనెల 26 వ తేదీ నుంచి మార్చ్ 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మహా రుద్రాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకే చోట మట్టిలింగాలను తయారుచేసి అదే చోట మహా కుంభాభిషేకం చేయడం ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని అన్నారు. […]

WhatsApp Image 2024-02-25 at 5.24.09 PM Exclusive

ఈ.ఎస్.ఐ.సి. హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాని…

కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి, అప్పటి కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగవర్ కి బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కాకినాడ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఈరోజు కాకినాడలో కార్మికుల సంక్షేమం కోసం 113 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన […]

maxresdefault (7) Viral

ఛలో విజయవాడకు అనుమతులు లేవు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ ఉద్యమ శంఖారావం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాని ఏ.పీ. జే.ఏ.సి. ఛలో విజయవాడ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతులు ఇవ్వనందున అనుమతులు లేని సభలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని, అటువంటి కార్యక్రమాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, […]

WhatsApp Image 2024-02-25 at 11.39.44 AM (1) Viral

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది… -సి.పి.ఐ.-

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ. కార్యాలయములో పాత్రికేయల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కుల మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం […]

1000023928 Viral

కాకినాడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లా కాకినాడలోని జగన్నాధపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు పై ఒక వ్యక్తిని జగన్నాధపురం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థాలానికి వెళ్లారు. మృతుడిని స్థానిక ఆసుపత్రి కి తరలించారు. పాత బస్టాండ్కు చెందిన కిలాడి పవన్ జగన్నాధపురం నుండి అన్నమ్మామట్టి సెంటర్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు గుద్దడంతో అక్కడికక్కడే […]

72445844 Political

జగన్ ప్రభుత్వంపై రఘు రామకృష్ణరాజు ఫైర్…

ఆంధ్ర ప్రదేశ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. రెబల్‌ ఎం.పీ. రఘు రామకృష్ణరాజు కనుమూరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా నరసాపురం ఎం.పీ. మాట్లాడుతూ… మనమందరం పబ్లిక్‌ ప్రాబిటీస్‌, మ్యాండేట్‌ ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ అసాంఘిక సంఘం నుంచి మా ఇద్దరినీ ఒక్కసారే విముక్తి చేస్తామన్నారని ఆయన అన్నారు. నవంబర్ 2019 లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుండి రాజు మరియు పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందన్నారు. మే 2021లో […]

OIF (1) Political

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి స్కోప్…

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 118 మంది అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే కాషాయ పార్టీ కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయితే బీ.జే.పీ. ని సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు జరిగిందని ఇద్దరు నేతలు చెప్పారు. తొలి జాబితా ప్రకారం 94 స్థానాల్లో టీ.డీ.పీ. అభ్యర్థులు, 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని తెలిపారు. […]