WhatsApp Image 2024-03-13 at 7.06.04 PM Exclusive

భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలి…

ఎక్కడైనా కార్మికుల ఐక్యత పోరాటాలు ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అన్నారు. జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ జి.జి.హెచ్. ప్రాంగణంలో సి.హెచ్. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన శానిటేషన్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం లో శేషబాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ నిర్వహించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అయితే […]

WhatsApp Image 2024-03-13 at 5.44.28 PM Political

జనసేనలోకి గంటా నరహరి చేరిక…

తిరుపతికి చెందిన గంటా నరహరి జనసేన పార్టీలోకి చేరారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయనకి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధి కి దోహద పడాలని సూచించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విరి విగృహాన్ని పవన్ కళ్యాన్ కి అందచేసారు.

WhatsApp Image 2024-03-13 at 11.28.45 AM Political

చిలుకలూరిపేటలో ఉమ్మడి బహిరంగసభకు సర్వం సిద్ధం…

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భాదత్ జనతా పార్టీ పొత్తు కుదరడంతో పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కలయికతో ఉమ్మడి బహిరంగసభను 17వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు సంబందించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు పార్టీల నేతలు కలిసి అక్కడ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వారు వెళ్ళడించారు.

WhatsApp Image 2024-03-12 at 9.46.51 PM Kakinada

జీతాలు పెంపుదల ఇతర డిమాండ్స్ పై కుదిరిన ఒప్పందం…

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు గత నెల రోజులు పైగా ఆందోళన చేసిన సోమవారం ఉదయం ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కార్మికుల యూనియన్ ప్రతినిధులు, సి.ఐ.టి.యు. నాయకులతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఒక అంగీకారానికి వచ్చారు. బుధవారం ఉదయం నుండి యధావిధిగా విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించారు. ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ కు చేతికి అందుతున్న జీతం రూ. […]

WhatsApp Image 2024-03-12 at 9.46.13 PM Exclusive

గిరిజన విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ సాయం…

పరీక్షలు సమీపిస్తున్న సమయంలో గిరిజన విద్యార్థులకు సానా సతీష్ బాబు మార్గదర్శనంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సాయం చేసింది. ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, పాండవుల పాలెం మరియు వొమ్మంగి గ్రామాలలో జిల్లా పరిషత్ మరియు గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు గిరిజన విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలకు పోటీ పడుతూ చదవాలని, అందరూ మంచి మార్కులు సాధించాలని […]

hqdefault (1) Trending News

నిరుద్యోగున సమస్యలపై బొత్స ఝాన్సీ లక్ష్మి కి వినతీ పత్రం…

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ ఓదార్పు యాత్ర అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ బొత్స ఝాన్సీ లక్ష్మి దృష్టికి అన్ని నిరుద్యోగ సమస్యలను వినతి పత్రం రూపంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర యూనివర్సిటీలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అన్ని హాస్టల్ డైలీ వేజ్ గా ఉన్న సిబ్బందిని 28 […]

WhatsApp Image 2024-03-12 at 6.47.32 PM Exclusive

అత్యుత్తమ అధికారి ప్రవీణ్ ఆదిత్య బదిలీ బాధాకరం… -పౌరసంక్షేమ సంఘం-

అత్యుత్తమ అధికారి ప్రవీణ్ ఆదిత్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజులు పూర్తి కాకుండానే పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేయడం అత్యంత దురదృష్టకరమని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ నగర పాలక సంస్థలో కమీషనర్ గా పనిచేసిన అత్యుత్తమ అధికారి వావిరాల మహేష్ కుమార్ ను నెలల వ్యవధిలోనే బదిలీ చేసారన్నారు. అదే కార్పోరేషన్ లో వివిధ హోదాల్లో ఆరున్నర ఏళ్లుగా తిష్ట వేసిన అధికారులను కొనసాగిస్తున్నారని ఎన్నికల వేళలో […]

WhatsApp Image 2024-03-12 at 3.38.42 PM Culture

రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలి… -దూసర్లపూడి రమణ రాజు-

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామకృష్ణారావు పేట ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమాన్ దంపతులకు బియ్యం, పంచదార, గోధుమ, జీడిపప్పు, సేమ్యా సామాగ్రితో స్వయంపాకం అందజేశారు. హిందు ముస్లిమ్ క్రైస్తవ జైన్ మతం ఏదైనా భారతీయ తత్వంతో సమసమాజ దేశ ప్రగతి కోసం పండుగ రోజులను భారతమాతకు దక్కే అంకిత […]

051f86f6-2157-4a80-8952-47c3d815107d Exclusive

జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్ తో అఖిలపక్షం నేతలు…

కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రాజ్యాంగ హక్కుగా ప్రజలు తమ అవస్థలు తెలుపుకునే నిరసన హక్కు కొనసాగించాలని అఖిల పక్షం నేతలు జిల్లా ఎస్.పి. ఎస్. సతీష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం మాట్లాడుతూ… రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ధర్నాచౌక్ మార్చాలని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు అఖిల పక్షం డిమాండ్ గా జనవరి 26న నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు. ఆ తరుణంలో ప్రకటించిన హామీ ప్రకారం […]

pawan-kalyan-speech-image-credits-twitter-com-e3talkies_1143407 Future

డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలకు అభినందనలు… -పవన్ కళ్యాన్-

భారతదేశానికి అగ్ని-5 క్షిపణి రూపంలో దివ్యాస్త్రాన్ని అందించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డి.ఆర్.డి.ఓ. శాస్త్రవేత్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణి పని తీరు తెలుసుకుంటే దేశం గర్వించదగిన ఆవిష్కరణగా చెప్పక తప్పదని ఆయన అన్నారు. ఐదు వేల కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఈ అస్త్రం ఛేదించడం మన దేశ రక్షణ వ్యవస్థకు అనితరమైన బలాన్ని […]