విష ప్రచారాలు చేస్తున్నారు… -నాదెండ్ల మనోహర్-
మూడు పార్టీలూ ఒకే తాటిపైకి రావడం అధికార వైసీపీకి నచ్చక వారు రకరకాలుగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొత్తులను చెడగొట్టాలని పన్నాగం పన్నుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రయత్నాలు మొదలయ్యాయని, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా కూటమి పొత్తులకు నష్టం కలిగించే పనులు చేయ్యకూడడని తెలిపారు. కచ్చితంగా కొన్ని రోజులుపాటు వై.సీ.పీ. సోషల్ […]









