రజకుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… -వనమాడి కొండబాబు-
కాకినాడ జిల్లాలో టీ.డీ.పీ. బీ.సీ. సెల్ రజక సాధికార కమిటీ కన్వినర్ ఏ.వీ.డీ. మెంటారావు ఆధ్యక్షతన కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు శుక్రవారం రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు, టీ.డీ.పీ. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. […]









