WhatsApp Image 2023-12-02 at 6.11.20 PM Trending News

బీ.జే.పీ. పార్టీ అధ్యక్షురాలను కలిసిన బొందిలి సంక్షేమ సభ్యులు…

బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేదెందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరుని బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుజన్ సింగ్, శంకర్ సింగ్ మాట్లాడుతూ… బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి తో బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో కేంద్ర పరిధిలో ఉన్న బీ.జే.పీ. కేటగిరీలో చేర్చడానికి ఎన్సీబీసీ చైర్మన్ గారికి సిఫార్సు చేయుటకు పురందేశ్వరి […]

WhatsApp Image 2023-12-02 at 4.50.30 PM Exclusive

తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి… టోల్‌ప్రీ నెంబర్‌ 1800 4255 990 కాల్‌ చేయండి…

తుఫాన్‌ హెచ్చరికల నేపద్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీ.హెచ్‌. నాగనరసింహారావు సంబంధిత అదికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో వివిధ విభాగాధిపతులు, ప్రత్యేకాధికారులతో ఈ అంశంపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ… రానున్న ఒకటి రెండు రోజుల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఆయా డివిజన్లకు చెందిన ప్రత్యేకాధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు […]

WhatsApp Image 2023-12-02 at 4.50.30 PM Exclusive

సెక్టార్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీసులకు శిక్షణా కార్యక్రమం…

సాధారణ ఎన్నికలకు సంబంధించి వల్నరబుల్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సెక్టార్ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు సెక్టార్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీస్ ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ […]

bc386be4-3844-4981-b99a-b55d9cc669e5 Political

ఈ.వీ.ఎమ్. మిషన్ ల పై అవగాహన సదస్సు…

వచ్చే ఎన్నికల్లో ఈ.వీ.ఎమ్. మిషన్ లను ఎలా ఉపయోగించాలనే విషయం పై కాకినడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎర్పాటుచేసిన ఈ.వీ.ఎమ్. మిషన్ అవగాహన సదస్సును తాసిల్దార్ బీ. శ్రీదేవి ప్రారంభించారు. 2024 లో జరగబోయే ఎన్నికల్ల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈ.వీ.ఎమ్.)లను ఉపయోగించి ఓటర్లు ఓటు ఎలా వెయ్యాలో డెమో రూపంలో ఆమే ఓటర్లకు వివరించారు. ఈ కార్యాక్రమంలో జగ్గంపేట తాసిల్దార్ బీ. శ్రీదేవి, ఎలక్షన్ కమీషన్ అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు.

lokesh_paday_46_f89c654826 Political

లోకేష్ ను కలిసిన దివ్యాంగులు

కాకినాడ లో జరుగుతున్న యువగలం పాదయాత్రలో తెలుగు దేశం పార్టీ యువ అథినేత నారా లోకేష్ ను దివ్యాంగులు కలిశారు. ఈ సందర్బంగా నారా లోకేష్ వాళ్ళతో మాట్లాడుతూ… వచ్ఛేది తెలుగు దేశం ప్రభుతవమే అని చెప్పారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర ఆశ్రయ జిల్లా వికలాంగుల సమెక్య ప్రెసిడెంట్ పెనపోతుల సురేష్, దివ్యంగులతో కలిసి తమ సమస్యల పై వినతి పత్రాన్ని ఆయనకు అందచేశారు.

కాకినాడలో లోకేష్ యువగళానికి ప్రజలు బ్రహ్మరథం…

తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో సాగుతున్న యువగళం పాదయాత్రకు కాకినాడ టీ.డీ.పీ. శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. కాకినాడ పరిసర ప్రాంతంలోని చొల్లంగి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రగా బయలుదేరి ఎమ్.ఎస్.ఎన్. చార్టీస్, జగన్నాధపురం ఎన్టీఆర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, కోకిల సెంటర్ మీదుగా కొనసాగింది. ఆయన పాదయాత్రకు అడుగడుగున కాకినాడ ప్రజలతో పాటు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం వై.సీ.పీ. పాలనలో ప్రజలు […]

WhatsApp Image 2023-12-01 at 3.43.45 PM Political

నారా లోకేష్ ని కలిసి వినతిపత్రం ఇచ్చిన డా. పిట్టా వరప్రసాద్…

యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వరప్రసాద్, నాయకులు పిల్లి రామారావు, పెమ్మాడి కిరణ్ కుమార్, తదితరులు కలిశారు. నారా లోకేష్ కు సంక్షేమ పథకాలు సంబందించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ… 2024 ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత వై.. […]

WhatsApp Image 2023-12-01 at 11.11.37 AM Trending News

టిప్పర్ లారీ బోల్తాలో ఇద్దరికి గాయాలు…

సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో మహారానీ కళాశాల సమీపాన జగనన్న కాలనీ ఎదురుగా రాజమండ్రీ నుంచి సామర్లకోట కి ఇసుక లోడ్ తో వస్తున్న టిప్పర్ లారీ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్పారావు, క్లీనర్ లు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయివారిని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

212106-police Exclusive

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 14 మందికి జరిమానా విదించిన కోర్టు…

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 14 మందికి పెద్దాపురం కోర్టు ఒక్కొక్కరికి రూ. 40 వేలు వంతున జరిమానా విధించిందని జగ్గంపేట సీఐ లక్ష్మణరావు తెలిపారు. గత నవంబర్లో జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి పోలీసులు 14 మంది మీద కేసులు నమోదు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా 14 మందికి జరిమానా, ఒక వ్యక్తికి రెండు రోజులు జైలు శిక్ష విధించారని చెప్పారు.

OIP (3) Political

మండపేట లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం…

మండపేట నియోజకవర్గ లో 10వ వార్డ్ సచివాలయం లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి విచ్చాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలో అర్హులయిన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ దుర్గారాణి, కోప్షన్ సభ్యులు రెడ్డ రాజబాబు, వై.సీ.పీ. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.