ఎన్.డీ.ఏ. కూటమికి బ్రహ్మరథం పట్టిన బెజవాడ జనం…
కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా బెజవాడ పురవీధులు ఎన్డీఏ కూటమి పక్షాల వికసిత నినాదాలు మిన్నంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నిర్వహించిన భారీ రోడ్ షో జయహో మోదీ జీ.. జయజయహో పవన్, జయహో చంద్రబాబు నినాదాలతో మారుమోగింది. బందరు రోడ్డులో ఎన్డీఏ అగ్రనేతలు ప్రచార రథంపై విహరించగా దేశ ప్రధానితో పాటు జనసేన, టీ.డీ.పీ. అధినేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం సాయంత్రం […]









