కాకినాడ జిల్లాలో టీ.డీ.పీ. బీ.సీ. సెల్ రజక సాధికార కమిటీ కన్వినర్ ఏ.వీ.డీ. మెంటారావు ఆధ్యక్షతన కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు శుక్రవారం రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు, టీ.డీ.పీ. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీ.సీ. కులాలకు ఆదరణ పథకం ద్వారా కుల వృత్తులు చేసుకునే వర్గాల వారికి సామాగ్రి పనిముట్లు అందించారన్నారు.
రజకులకు వాషింగ్ మిషన్, ఐరన్ బాక్సులు, సబ్సిడీపై అందించి వారిని ఆదుకోవడంతో పాటు సబ్సిడీ ద్వారా రుణాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల్ల బాబురావు, గొలితు సత్యనారాయణ, నరం శ్రీనివాసరావు, అనకాపల్లి గణేష్ రావు, ర్యాలీ రాంబాబు, సీల అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

