కాకినాడ స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంబేద్కర్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అయన హాస్టల్ ప్రాంగణంలో జరుగుతున్న పలు నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హాస్టల్ లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గొప్ప గొప్ప పదవులను సైతం చేపట్టారని ఇటువంటి హాస్టల్ను భావితరానికి అందించేందుకుగాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో నగరానికి చెందిన దాతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
హాస్టల్ అభివృద్ధికి సహకరించండి…

