సీనియర్ జర్నలిస్ట్, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా హరిప్రసాద్ మాట్లాడుతూ… ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా హరిప్రసాద్ కి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు తెలిపారు. హరిప్రసాద్ కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల పార్టీలోని ప్రతీ ఒక్కరూ మనస్పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరిప్రసాద్ కొన్సిల్లో జరిగే చర్చల్లో ప్రజల పక్షాన బలమైన గొంతుకగా నిలబడతారని ఆశిస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ అభినందనలు… -పవన్ కళ్యాన్-

