కాకినాడ సూర్యారావు పేటలో దూసర్లపూడి వారి వీధి శ్రీభోగిగణపతి(స్వయంభు)పీఠంలో 3వ సోమవారం ధనుర్మాసం సందర్భంగా సముద్ర జలాల పూర్ణకుంభానికి విష్ణుసహస్రనామ పారాయణతో ప్రత్యేక పూజలు మహాహారతి శ్రీవారి 7వ అన్నసమారాధన శుభప్రదంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, రవిక ప్రధానం స్వీకరించారు. జనవరి 8వ తేదీన శ్రీవారి 8వ అన్న సమారాధన జరగుతుందని తెలిపారు. 14వ తేదీన భోగి పండుగనాడు గణపతి పీఠం 17వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా భారీ అన్నసంతర్పణ జరుగుతుందని చెప్పారు. మకర సంక్రాంతి 15 సోమవారం రాత్రి శ్రీ అయ్యప్ప పడిహారతి పూజాకార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు..
సముద్రజలాల పూర్ణ కుంభానికి శ్రీమహావిష్ణుహారతి…
