ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ కుమార్తె రాధే జగ్గీ ఇన్స్టాగ్రామ్లో తన తండ్రి కోలుకుంటున్నారని తెలిపారు. సద్గురు బాగానే ఉన్నారని త్వరగా కోలుకుంటున్నారు అని రాధే బుధవారం తెలిపారు. కోయంబత్తూర్కు చెందిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదివారం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మెదడుకు సంబందించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారని వారు తెలిపారు.
ఆయన త్వరగా కోలుకోవాలని తన అనుచరుల నుండి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అతని తలలో ప్రాణాంతక రక్తస్రావంతో బాధపడ్డారని అన్నారు. ఇప్పుడు కోలుకునే మార్గంలో ఉన్నారని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి సీనియర్ వైద్యుడు తెలిపారు. అతను ఆసుపత్రి బెడ్ నుండి అతని ఆరోగ్యం గురించిన నవీకరణను కూడా పంచుకున్నారు.
