రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఏ.పీ. ముఖ్య మంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చేస్తున్న నిరసన దీక్షా కార్యక్రమం 35 వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు ఆద్వర్యంలో అంగన్ వాడి మరియు హెల్పర్లు, యూనియన్ జిల్లా నాయకురాలు కొర్రపు, రాణి, తదితరులు స్థానిక వీదుల్లో భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సంక్రాంతి పండగలో జగన్ మనసు మారి తమ కోరికలును తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు, యూనియన్ జిల్లా నాయకురాలు కొర్రపు, సీ.ఐ.టీ.యూ. నాయకులు, అంగన్ వాడీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

