శ్రీలంక కు తూర్పు దిశగా బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని విపత్తుల శాఖ సంస్థ తెలిపింది. ఇది రేపటికి దక్షిణ శ్రీలంక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ప్రయానించి ఎల్లుండి కి హిందూ మహాసముద్రం చేరుకోనే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం వల్ల నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వెంబడి మేఘాలు ప్రయానిస్తాయి కాని వర్షాలు పడవని తెలిపింది. తేలికపాటి జల్లులు పడే అవకాశముందని ప్రజలు భయపడవల్సిన అవసరం లేదని చెప్పింది.
అదే సమయంలో దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని విపత్తుల శాఖ తెలిపింది. ఈ నెల 18 కి బలమైన అల్పపీడనం గా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బలపడనున్నట్లు తెలిపింది. కానీ ఇది కూడా శ్రీలంక వైపుగా వెళ్ళిపోయే అవకాశాలు 80 శాతం వుందని పేర్కొంది.
శ్రీలంక కు తూర్పు దిశగా ఉపరితలం ఆవర్తనం…