ఈ నెల 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబందించి ఈ నెల 7 వ తేదీన సాయంత్రం బాపట్ల నియోజక వర్గాన్ని పర్యటించి బహిరంగ సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. తరువాత 8 వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్నిహాజరు కానున్నట్లు వెళ్లడించారు.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజక వర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 9 వ తేదీ ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజక వర్గంలో సాయంత్రం 5 గంటలకు తుని నియోజక వర్గాన్ని పర్యటించనున్నారు. 10 వ తేదీన నర్సీపట్నం నియోజక వర్గాన్ని, పాడేరు నియోజక వర్గాన్ని సందర్శించనున్నారు. చివరి రోజు నగరి నియోజక వర్గాన్ని పర్యటించనున్నట్లు తెలిపారు.

