Exclusive

వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. నుంచి వైదొలిగిన ఎం.ఎస్‌. బాబు…

dd

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్‌. బాబు శనివారం కడపలో ఏ.పీ.సీ.సీ అధినేత్రి వై.ఎస్‌. షర్మిలను కలిసిన తర్వాత అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చిత్తూరు నుంచి వైఎస్సార్‌సీపీని వీడిన మూడో శాసనసభ్యుడు బాబు.

గతంలో పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించడంతో పాటు ఎన్డీయే మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేనతో కలవడంతో చిత్తూరు శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు, సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలంలను వైఎస్సార్‌సీపీ తొలగించింది. ఆ తర్వాత శ్రీనివాసులు జనసేనలో చేరగా, ఆదిమూలం టీడీపీలో చేరారు.

వైఎస్‌ఆర్‌సిపి మాజీ శాసనసభ్యుడు సునీల్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించిన పూతలపట్టు నుంచి కాంగ్రెస్‌ బాబును పోటీకి దింపుతుందేమో అనే అనుమానాలు వెళ్లుబుచ్చుతున్నాయి. టీడీపీ నుంచి జర్నలిస్టు కే. మురళీమోహన్‌ పోటీ చేయడంతో పూతలపట్టులో ముక్కోణపు పోటీ నెలకొంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.