తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. మునిపల్లి మండలం మల్లికార్జునపల్లిలో విద్యుత్ షాక్ తగిలి లైన్ మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో బాలరాజు అనే లైన్ మెన్ స్తంభం పైనే మృతి చెందాడు. స్థానికు సమాచారంతో సంభందిత అదికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని క్రిందకు దించే ప్రయత్నంచేస్తున్నారు.
విద్యుత్ షాక్ తో లైన్ మాన్ మృతి…

