బుక్కరాయసముద్రం సీ.ఐ. నాగార్జున రెడ్డి వికలాంగుడి పై దాష్టీకానికి పాలుపడ్డాడు. నా చావుకు సీ.ఐ. నాగార్జున రెడ్డే కారణమని బాధితుడు అవేదన వ్యక్తం చేసాడు. బుక్కరాయసముద్రం సీ.ఐ. గత కొంతకాలంగా తన పై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి సంబందించి గ్రామ మహిళా సంఘాల యానిమేటర్ గా పనిచేస్తున్న వికలాంగుడు మహానంద రెడ్డి ఆవేదనను తెలిపాడు. తను వికలాంగుడునని కూడా చూడకుండా సీఐ దాడి చేసాడాని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని అన్నాడు.
ఉన్నత అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు అంటు పురుగులు మందు డబ్బతో వికలాంగుడు అవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల రూపాయలు డబ్బులు తెస్తే సరిపోతుందని లేకుంటే నీ అంతు చూస్తాను అని సిఐ బెదిరిస్తున్నాడని తెలిపారు.ఆ సొమ్ము పొదుపు సంఘాల వారికి ఇవ్వడానికో లేకపోతే సీఐ తీసుకోవడానికి నాకు తెలియదు అని అంటు వికలాంగుడు వ్యక్తంచే
సాడు. సీఐ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య శరణ్యం అని అంటు పురుగులు మందు డబ్బాను చేతిలో పట్టుకొని తన ఆందోళన వ్యక్తం చేసాడు. తన శరీరం పై ఉన్న ఎర్రటి వాతలను మీడియాకి చూపించాడు.

