వై.సీ.పీ. ప్రభుత్వంలో వాలంటీర్లంతా తప్పు చేశారని ఎప్పుడూ అనలేదని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. కొందరు చేసిన పని వల్ల చెడ్డ పేరు అందరికీ వస్తోందని మాత్రమే చెప్పానన్నారు. కూటమి ప్రభుత్వంలో టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు చెప్పినట్లు వారికి రూ.10 వేల వేతనం ఇచ్చి, ప్రజలకు మేలు చేసే పనులకు వారిని ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా వారితో పని చేయించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇలా పని చేసేవారికి కచ్చితంగా మేం అండగా నిలబడతాం. వాలంటీర్ల కడుపుకొట్టేలా ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసారు. ముఖ్యంగా కోనసీమలో రైలు కూత వినిపించాలనేది దివంగత లోక్ సభ స్పీకర్ జీ.ఎం.సీ. బాలయోగి కోరికన్నారు. దాన్ని సాకారం చేసేలా కోనసీమకు రైలు మార్గం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.
వాలంటీర్లకు అండగా నిలబడతాం…

