ఏలూరు జిల్లా లో కుక్కునూరు మండలం అంగన్వాడీ సమస్యలపై సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన ప్రకటిస్తుంటే అధాకారులు వారిని బెదిరించడం దుర్మార్గమని సి.ఐ.టి.యు. మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ విమర్శించారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 2వ రోజుకు పూర్తిచేసుకున్న కారణంగా సమ్మె శిబిరం నుండి అంబెడ్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ… అహర్నిశలు కృషి చేస్తున్న అంగన్వాడీ వేతనాలు పెంచమని ఆందోళన చేస్తుంటే, సమస్యలు పరిష్కరించడం చేతకాక అధికారులు రాజకీయ, నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మీటింగుల పేరుతో ఆహ్వానించి మేము చెప్పింది వినకపోతే అంగన్వాడీలను తొలగిస్తామని చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు.

