నిజం తెలుసుకుని వాస్తవాలు గ్రహించి ఆరోపణలు చేస్తే హుందాగా ఉంటుందని, ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే పిచ్చివాడిగా జమ కట్టాల్సి వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మనవడి కొండబాబుపై నిప్పులు జరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటన విజయవంతం కావడంతో కొండబాబుకు కళ్ళు బైర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడూతు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 ఉన్న పెన్షన్లను 3000 వరకు పెంచుకుంటూ వెళతామని దానిలో బాగం గానే ఇచ్చిన మాట మేరకు మూడు వేల రూపాయలకు పింఛను పెంచడం జరిగిందన్నారు.
రూ. 3000 ఒకేసారి పెంచుతామనలేదు…. -కాకినాడ సిటీ ఎమ్మెల్యే-

