వై.ఎస్.ఆర్. కడప జిల్లాలో బద్వేలు నియోజకవర్గం గోపవరంలో రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన సెంచురీ ప్లై ఇండస్ట్రీ పరిశ్రమ యూనిట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పరిశ్రమలోని ఎం.డీ.ఎఫ్., హెచ్.పీ.ఎల్. ప్లాంట్లను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం చైర్మన్, సిబ్బందితో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ పరిశ్రమ వల్ల 2,266 మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని వేల మందికి పరోక్ష ఉపాధి లభించనుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ. 15 లక్షల రాయితీ ధరతో ఏ.పీ.ఐ.ఐ.సీ. ద్వారా సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటయిందన్నారు.

