Exclusive

రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించాలి…

WhatsApp Image 2024-01-23 at 12.12.03 PM

రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడంలో నిర్లక్ష్య ధోరణి కనబర్చుతుందని రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లోని ఇంద్రపాలెం రజక కమ్యూనిటీ హాల్లో కొజ్జవరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరయ్య మాట్లాడుతూ… రజక వృత్తిదారులు నిరంతరం ప్రజలు శుభ్రంగా ఉండాలని సేవా వృతైన రజక వృత్తిని ఎంచుకొని ప్రజా శుభ్రత కోసం పనిచేస్తున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వం రజక వృత్తిని పౌరుసేవ వృత్తిగా గుర్తించకపోగా వృత్తి నిర్వహణలో యంత్రాలు ప్రవేశించినందువలన ఉపాధికి గండి పడే అవకాశం ఉందని వెల్లడించారు. రజక వృత్తిదారులకు స్టీమ్ ఐరన్ ఇస్త్రీ చేసేందుకు 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని అర్బన్ కేంద్రాల్లో మోడ్రన్ ధోబి గార్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.