Political

అంగన్వాడీల సమస్యల పై కేంద్రమంత్రికి వినతి పత్రం…

WhatsApp Image 2024-01-18 at 11.56.44 AM

రాష్ట్రంలో అంగన్వాడీలు గత 37 రోజులుగా నిరవధికంగా, విశ్రాంతి లేకుండా వారి డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ వినతి పత్రం ద్వారా కేంద్ర మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ముంజుపారా మహేంద్ర బాయ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వికసిత్ భారత్ సంకల్పయాత్ర లో భాగంగా జిల్లాలో పర్యటించి రాత్రి కాకినాడలో బస చేశారు .

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్, గట్టి సత్యనారాయణ, దువ్వూరి సుబ్రహ్మణ్యం, తదితరులు మంత్రిని కలిసి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణి నీ వివరిస్తూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ మాట్లాడుతూ… అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై కేంద్రమంత్రి పరపతిని ఉపయోగించాలని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.