తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో చాలా విజయవంతంగా సాగుతుంది. లోకేశ్ పాద యాత్ర దాదాపు 226 రోజులు పాటు 97 నియోజకవర్గాలు, 2100 పై చిలుకు గ్రామాల్లో ఎడతెరపులేకుండా సాగింది. కాని ఇప్పుడు పాద యాత్ర ముగింపుకు రానున్నట్లు తెలిపారు. ఈ యువగళం నవశకం బహిరంగ సభను డిసెంబర్ 20 తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాక్రమానికి తెలుగు ప్రజలందరు హాజరయ్యి విజయవంతం చేయాలని లోకేశ్ కోరారు.
యువగళం నవశకం బహిరంగ సభను విజయవంతం చేయాలి…

