ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అంజుమన్-ఐ-ఇస్లాం పాఠశాల నుండి ఇరవై మంది పిల్లలతో వెళ్తున్న పాఠశాల బస్సు JJ ఫ్లైఓవర్పై ప్రమాదానికి గురికావడంతో 12 ఏళ్ల విద్యార్థితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. డ్రైవర్ వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో బస్సు రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థి జె.జె. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 22 ఏళ్ల క్లీనర్ జిటి ఆసుపత్రిలో చేరాడు.
ముంబై జే.జే. ఫ్లైఓవర్పై బస్సు ప్రమాదం…
