రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పార్టీ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని హామి ఇచ్చారు.
వారి గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు సమావేశంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం, ఎన్నికల్లో తాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకొంటున్నదీ మహిళా నేతలు అందించిన సూచనలు ఎంతో విలువైనవి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కోటంరాజు శరత్ కుమార్ పాల్గొన్నారు.

