ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఎన్నికలకు అన్ని సద్దం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో పోలిగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని గౌతమీ మున్సిపల్ పాఠశాలలో దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోరులో కొత్తగా 69వ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఆ కేంద్రంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ కలిసి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అక్కడికి వచ్చిన ఓటర్లకు అవగాహన కల్పించారు. ఆ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ, ఓటర్లు పాల్గొన్నారు.
మండపేట పట్టణంలో 69వ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…

