బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కైమూర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల్లో భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు ఉన్నారని అధికారులు వెళ్లడించారు. నటీమణులు, సింగర్లు ఛోటూ పాండే, సత్యనటీమణులు ఆంచల్, సిమ్రాన్ శ్రీవాస్తవ, ప్రకాశ్ మిశ్రా ఈ ప్రమాదంలో మృతు చెందినట్లు తెలిపారు. ఘటన తెలుసుకున్న బీహార్ రాష్ట్ర ముఖ్య మంత్రి నితీష్ కుమార్ మృతుల కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి తెలిపారు.
భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాదం…
