భారతదేశంలో కవిడ్ యొక్క కొత్త వేరియంట్ కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 290 KP.2, 34 KP.1 కేసులు నమోదయ్యాయి. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం నుండి వచ్చిన డేటా ప్రకారం… ఏడు రాష్ట్రాలు, UTలలో 34 KP.1 కేసులు కనుగొనబడ్డాయి. వీటిలో 23 కేసులు పశ్చిమ బెంగాల్లో నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు గుజరాత్ లో 2, హర్యానాలో 1, మహారాష్ట్రలో 4, రాజస్థాన్ లో 2, గోవా లో 1 మరియు ఉత్తరాఖండ్ లో 1 నమోదయ్యాయి.
దీనితో పాటు 290 KP.2 కేసులు నమోదయినట్లు వెళ్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 148 నమోదయినట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలయిన ఢిల్లీ లో 1, గోవా లో12, గుజరాత్ లో 23, హర్యానాలో 3, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్ లో 1, ఒడిశా లో 17, రాజస్థాన్ లో 21, ఉత్తరప్రదేశ్ లో 8, ఉత్తరాఖండ్ లో 16, పశ్చిమ బెంగాల్ లో 36 నమోదయ్యాయి.