పశ్చిమ బెంగాల్ లో ఐదవ దశ ఎన్నికల ప్రక్రియను సూచిస్తూ… లోక్సభ ఎన్నికల్లో బొంగావ్ నియోజకవర్గానికి మే 20న పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ లోక్ సభకు 42 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ నిర్వహించనుంది. అనంతరం ఎన్నికల ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయని ఈ.సీ. వెళ్లడించింది. పశ్చిమ బెంగాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో TMC 22 సీట్లు గెలుచుకోగా, BJP 18 స్థానాలతో చెప్పుకోదగ్గ ఊపందుకుంది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. బొంగావ్ లోక్సభ నియోజకవర్గానికి బీ.జే.పీ. నుండి శంతను ఠాకూర్, AITC నుండి బిశ్వజిత్ దాస్, INC నుండి ప్రదీప్ బిస్వాస్ అభ్యర్థులుగా పోటీకి సిద్దమయ్యారు.
బొంగావ్ నియోజకవర్గానికి మే 20న పోలింగ్ జరగనుంది…

