ప్రధానమంత్రి నరేంద్ర మోడి సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నట్టు వెళ్లడించారు. ఈ పర్వటనకు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉన్నందుని తెలిపారు. ఇందులో భాగంగా వారికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. డా. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, వసతి, వైద్య సేవలు వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
జిల్లా యంత్రాంగం సమన్వయంతో అవసరమైన చోట్ల స్వాగత తోరణాలతో సహా ఇతర హోర్డింగులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా యంత్రాంగం తరపున పాస్ లు జారీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆయన ఆదేశించారు. ఇంకా ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి పలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

