పీలేరులో ఎన్.డీ.ఏ. కూటమి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో జనసేన ప్రధాన కార్యదర్శి జాగబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. పాలకులు రైతులకు మేలు చేయరని, నిరుద్యోగులను పట్టించుకోరని, వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోనివ్వరని అన్నారు. ఈ అరాచక పాలనకు ముగింపు పలకాలని ఆయన స్పష్టం చేశారు. వై.సీ.పీ. దాష్టికాలు ఆగాలన్నా, యువత, మహిళలు, రైతులకు భరోసా లభించాలన్నా దేశంలో మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. పరిపాలనా దక్షతలేని కక్షపూరిత రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రం ఐదేళ్లుగా తిరోగమనం బాట పట్టిందన్నారు. 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీ.డీ.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
పీలేరులో ఎన్.డీ.ఏ. కూటమి బహిరంగ సభ…

