కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణం జీవన నగర్ కాలనీకి చెందిన 80 మందికి పైగా ఎస్సీ మహిళలు సోమవారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరారు. జనసేన ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు వచ్చిన మహిళలు చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో చేరారు. అనంతరం తమ సమస్యలను విన్న వించుకున్నారు. సంక్షేమ పథకాలు తమకు సక్రమంగా ఇవ్వట్లేదని, డిగ్రీ పూర్తి చేసుకున్నా ఉద్యోగం దొరకని పరిస్థితుల్లో తమ పిల్లలు ఉన్నారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని, జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమిని గెలిపించుకుంటే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు.
పిఠాపురంలో జనసేనలో 80 మంది ఎస్సీ మహిళలు చేరిక…

