పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో జరిగిన యుద్ధాలు వల్ల మానవాళికి తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. లక్షల మంది ప్రాణాలు సైతం కోల్పోవడం బాధాకరమని అన్నారు. పెట్టుబడి సామ్రాజ్యవాద కాంక్షతో నేటికీ ప్రపంచంలో ఏదోమూల యుద్ధాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ఈ యుద్ధాలు భారతదేశం ప్రజానీకంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. ముఖ్యంగా మనుషుల మధ్య అగాధం పెంచి నిలువునా చీల్చుతున్నారని వాపోయారు. ఇప్పుడు తాజాగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్దఖాండ ఇందుకు నిదర్శనం తెలిపారు. గాజాలో శాంతి నెలకొనాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ
