జే.ఎస్.పీ., టీ.డీ.పీ., బీ.జే.పీ. శ్రేణులు కూటమి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… పోలింగు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మెజారిటీ సాధించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు నేతృత్వంలో అనపర్తి నియోజకవర్గంకు చెందిన జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కి చెందిన ముఖ్య నేతలు పిఠాపురంలో ఆయన్ని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్బంగా అనపర్తి వై.సీ.పీ. ముఖ్య నాయకులు సానా సాయిబాబు, బిరదా అన్నవరం, సానా రామకృష్ణ, తదితరులు నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో కూటమి గెలుపు దాదాపుగా ఖరారైందని కార్యకర్తలు అంతా ఐకమత్యంతో పని చేసి అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నాగబాబుతో అనపర్తి నియోజకవర్గం నేతల భేటీ…

