ఈ నెల 31వ తేది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 13,14,15 వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య కె. పద్మరాజు తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను వీసీ ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఎస్పీ పి.జగదీష్, జేసి ఎన్.శేషు భరత్, తదితరులు పరిశీలించారు. దానితో పాటు ట్రైల్ రన్ నిర్వహించారు. గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాన్ని, సభా ప్రాంగణాన్ని స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేసారు.
ఈ సందర్బంగా ఆయనల మాట్లాడుతూ… మధ్యాహ్నం 2 గంటలకు ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్.టి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ లో స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందని తెలిపారు.

