ఎన్నికలు సమీపిస్తుడడంతో రాజకీయ పార్టీల్లో మాటల యుద్ధాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదే కోవలో బండి సంజయ్ ను డైరెక్టుగా ధర్మపురి అరవింద్ విమర్శించారు. బండి సంజయ్ను అధ్యక్షుడిగా తొలగించడం వల్లే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటే నేను ఒప్పుకోనని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. 2019లో బీ.జే.పీ. 4 లోక్ సభ సీట్లు గెలిచినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు కాదని అన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లో ఓడిపోయాం అని హేళన చేసారు. జీహెచ్ఎంసీ తప్ప అన్ని మునిసిపాలిటీల్లో ఓడిపోయామన్నారు. మేం గెలిచినం అంటే అది టీం కృషి వల్లే ఆయనతో అయింది ఏం లేదు అని అన్నారు. ఆయన టైమ్ అయిపోయింది తీసేసి సీనియర్ నాయకుడిని అధ్యక్షుడు చేశారన్నారు.
ధర్మపురి అరవింద్ vs బండి సంజయ్…

