జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశం కర్నూల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. దళిత, గిరిజన ప్రజల సమస్యలను పరిష్కరించాలి డి.వి.ఎమ్.సి సభ్యులు ఎరుకల రాజు కలెక్టర్ కు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎరుకల రాజు మాట్లాడుతూ… క్రిష్ణగిరి మండలం, ఎరుకలచెరువు గ్రామంలో దళితులు తరతరాలుగా వాడుకుంటున్న రచ్చకట్టను కులవివక్షతో కూల్చి, ఆక్రమించుకున్నారని తెలిపారు.
ఆ స్థలంలో ఇల్లు నిర్మాణానికి పునాది తవ్విన వ్యక్తులపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటుంంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దళిత, గిరిజనులపై జరుగుతున్న మానభంగాలు, హత్యాచారాలను అరికట్టెందుకు తగు చర్యలు తీసుకోవాలని అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన అన్నారు.

