ఒక ప్రధాన రాజకీయ పరిణామంలో అస్సాంలోని నాలుగు బీ.జే.పీ. వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుతో పోటీ చేసేందుకు సంభావ్య విలీనం కోసం చర్చలు ప్రారంభించాయి. రైజోర్ దళ్ నాయకుడు అఖిల్ గొగోయ్ బుధవారం గౌహతిలో మీడియాతో ఈ చొరవను ధృవీకరించారు. మంగళవారం జరిగిన కీలక సమావేశంలో అఖిల్ గొగోయ్, అస్సాం జాతీయ పరిషత్ ఏ.జే.పీ. కి చెందిన లూరింజ్యోతి గొగోయ్, అసోం జాతీయ దళ్కు చెందిన అజిత్ కుమార్ భుయాన్ కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అఖిల్ గొగోయ్ మాట్లాడుతూ… కాంగ్రెస్తో మా పొత్తును కొనసాగించాలని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
త్రిపురలో కాంగ్రెస్లో చేరనున్న నాలుగు ఏంటీ బీ.జే.పీ. పార్టీలు…

