రాజకీయరంగంలో విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాలను అమలుపరిచిన సాహసోపేతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమే అన్న ఎన్టీఆర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కీర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గం నందు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు నందమూరి తారక రామారావు బసవతారకం బస్ షెల్టర్ వద్ద నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

