కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న కొండవారి పేట సమీపాన రైలు పట్టాల క్రింద పడి ఒక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి మృతుడిని స్తానిక హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ నగర్ కు చెందిన యు. నాగేశ్వరరావు (53) గా విచారణలో గుర్తించనట్లు జి.ఆర్.పి.ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ తెలిపారు. జరిగిన ఘటనపై మృతుడి కుటుంబానికి సమాచారమిచ్చామని తెలిపారు. విచారణలో చేతి వృత్తి చేస్తున్న అతను ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక మానసిక వేధనకు గురయ్యి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెళ్లడించారు.
తుని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవం…!!!
